Sunday, May 5, 2024
- Advertisement -

ప్ర‌భాస్‌ను ఆపే ద‌మ్ము తెలుగు హీరోల‌లో ఎవరికి ఉంది..?

- Advertisement -

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాకు ముందు క‌నీసం యాభై కోట్ల సినిమా ఒక్క‌టి కూడా లేదు.అత‌ను న‌టించిన మిర్చి సినిమానే ప్ర‌భాస్ కెరీర్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన సినిమా.మిర్చి సినిమా 40 అప్ప‌ట్లో 40 కోట్లు క‌లెక్ట్ చేసింది.కాని ఈ సినిమా త‌రువాత ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి తెలుగు చరిత్ర‌లోనే కాక ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే 2000 కోట్లు సాధించి రికార్డు సృష్టించింది.బాలీవుడ్ హీరోలు ఎప్ప‌టి నుంచో క‌లలు కంటున్న 1000 మార్కెట్‌ను దాటి ప్ర‌భాస్ 2000 కోట్లు సాధించి అంద‌రికి షాక్ ఇచ్చాడు.

ప్ర‌భాస్ స్టామినాను చూసి బాలీవుడ్ హీరోలు సైతం బిత్త‌రపోయారు.ఎంత‌లా అంటే బాహుబ‌లి సినిమా అంటే నిద్ర ప‌ట్ట‌నంతాగా వారు భ‌య‌ప‌డిపోయారు.ఇక మ‌న తెలుగు హీరోల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌డానికి ఏం ఉంది.తెలుగు స్టార్ హీరోలు సైతం బాహుబ‌లి సినిమా త‌రువాత త‌మ ఆలోచ‌న‌ల‌ను మార్చ‌కుంటున్నారు.త‌ప్ప బాహుబ‌లి బీట్ చేసే ప్ర‌య‌త్నాలు ఎవ‌రు చేయ‌డం లేదు.ప్ర‌స్తుతం ఉన్న తెలుగు హీరోలు నాన్ బాహుబ‌లి సినిమా రికార్డుల కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు.బాహుబ‌లికి ముందు మ‌హేశ్ బాబు,ఎన్టీఆర్‌,ప్ర‌భాస్‌,రామ్ చ‌ర‌ణ్‌ల మార్కెట్ ఎక్కువ‌.కాని ఇప్పుడు ప్ర‌భాస్ రేంజ్ అందుకునే స్థాయి ఈ హీరోల‌కి లేదు అంటే అతిశేయోక్తి కాదు.ప్ర‌భాస్ మార్కెట్ 2000 కోట్ల‌లో ఉంటే ప్ర‌స్తుతం ఉన్న తెలుగు హీరోల మార్కెట్ మాత్రం 200 మార్కెట్‌గా ఉంది.

బాహుబ‌లి రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డానికి బాలీవుడ్ హీరోలు ట్రై చేస్తున్నారు కాని ,మ‌న హీరోలు ఆ దిశ‌గా ఆలోచ‌న‌లు మాత్రం చేయ‌డం లేదు.నిజం చెప్ప‌లంటే ప్ర‌భాస్ మార్కెట్‌ను ట‌చ్ చేసే రేంజ్‌లో మ‌న తెలుగు హీరోలు లేర‌ని జ‌గమెరిగిన స‌త్యం అని చెప్ప‌వ‌చ్చు.ఇక ప్ర‌భాస్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న సాహో సినిమా హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కుతుంద‌ని టీజ‌ర్‌ను చూస్తే తెలిసిపోతుంది.ఇక ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తే ప్ర‌భాస్‌ను ప‌ట్టుకోవ‌డం తెలుగు హీరోల వ‌ల్ల కాద‌ని చాలామంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -