Monday, May 6, 2024
- Advertisement -

చిలిపి దాసరి…

- Advertisement -

ఎంత గంభీరంగా ఉండే మనిషి అయినా… ఎంత క్రమశిక్షణతో ఉన్న వ్యక్తి అయినా.. ఎక్కడో ఓ మూల ఎంతో కొంత కొంటెతనం.. చిలిపి గుణం కచ్చితంగా ఉంటాయి.

ఈ మాటను దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రూవ్ చేశారు. ఆయన నిజజీవితంలో జరిగిన ఓ సంఘటనను తనే చెప్పుకుని మురిసిపోయారు.

యువకళావాహిని ఆధ్వర్యంలో “జగదేక దర్శకుడు కేవీ రెడ్డి” పేరుతో.. ఈ సారి రుద్రమదేవి డైరెక్టర్ గుణశేఖర్ కు అవార్డు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన దాసరి.. గుణశేఖర్ కు అవార్డు ప్రదానం చేశారు. గుణశేఖర్ క్రియేటివిటీని ఆకాశానికి ఎత్తేసిన దాసరి.. పనిలో పనిగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు.

గుణశేఖర్ గతంలో సొగసు చూడతరమా పేరుతో ఓ సినిమా తీశారు. ఆ మూవీని దాసరి నారాయణరావు చూశారట. అందులో భార్యాభర్తల మధ్య ఉండే కొన్ని సీన్లు చూసి తను సిగ్గు పడ్డానని చెప్పారు. తను కూడా సిగ్గుపడేంత గొప్పగా గుణశేఖర్ సినిమా తీశారని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇదీ.. దాసరి సిగ్గు పడిన సందర్భం వెనక అసలు సంగతి. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -