Thursday, May 2, 2024
- Advertisement -

ఆ సినిమా సీక్వెల్ వెర్షన్ కు పవన్ ఓకే చెబుతాడా..?!

- Advertisement -

తమిళంలో ఖుషీ సినిమా సీక్వెల్ వెర్షన్ కు రంగం సిద్ధం అవుతోంది. తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా అంతకన్నా మునుపే తమిళంలో రూపొందింది. విజయ్, జ్యోతికలు హీరోహీరోయిన్లుగా రూపొందించిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ .

ఆ సినిమాను ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేశాడు. తమిళంలో హీట్టయ్యే సరికి ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఎస్ జే సూర్యనే దర్శకత్వం వహించగా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తమిళంలో సీక్వెల్ ప్రతిపాదన వచ్చింది.

తమిళంలో ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించడానికి నిర్మాత ఏఎం రత్నం చాలా ఆసక్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్ జే సూర్యదర్శకత్వం లోనే విజయ్ హీరోగా ఈ సినిమా రూపొందే అవకాశాలున్నాయని సమాచారం. విజయ్ కూడా సీక్వెల్ పట్ల ఉత్సాహంగానే ఉన్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తను హీరోగా రూపొందే సినిమాను పూర్తి చేసిన వెంటనే విజయ్ ఖుషీ పార్ట్ టూ పనులు మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా నయనతార ఓకే అయినట్టుగా తెలుస్తోంది. మరి పవన్ కెరీర్ లో కూడా ఖుషీ ఒక సెన్షేషనల్ హిట్. ఇలాంటి నేపథ్యంలో ఆయన సీక్వెల్ కు ఓకే చెబుతారా? లెట్ వెయిట్ అండ్ సీ:

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -