ఎన్నికల ఎక్కడ జరిగిన తమదే విజయం అన్నట్లుగా ఉంది ప్రధాన మంత్రి మోదీ(బీజేపి) వ్యవహారం.భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగిన బీజేపీ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది.తాజాగా కర్ణాటకలో జరిగిన ఎన్నికల ముందు ప్రతి సర్వే కాంగ్రెస్ వైపే మోగ్గు చూపాయి.అయితే సడన్గా ఎన్నికల తరువాత వచ్చిన ప్రతి సర్వే మోదీకి మద్దతు తెలిపాయి.ఈ రోజు(మంగళవారం) వచ్చిన కర్ణాటక ఎన్నికల ఫలితలలో అందరి అంచానలను తల కిందులు చేస్తు బీజేపీ అధికారంలోకి వచ్చింది.
దీనిపై రాజకీయ ప్రముఖులతో పాటు సీని ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.కర్ణాటక ఎన్నికల ఫలితలపై సీని రచయిత కోన వెంకట్ స్పందించారు.కోన వెంకట్ ఈవీఎంకు కొత్త తరహా అర్థాన్ని చెబుతూ ఈవీఎం అంటే.. ఎవ్రీ ఓట్ మోడీ.. మోడీకు ప్రతి ఓటు అంటూ వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ స్టార్ట్ చేసింది మొదలు.. రిజల్ట్ ప్రతి ఒక్కటీ మోడీకే అన్నట్లుగా వచ్చినట్లుగా కోన వెంకట్ వ్యాఖ్యానించారు.
When they opened EVMs today in Karnataka (Electronic voting machines) … The results are… EVM (Everybody Voted for Modi) … No comments!!
— KONA VENKAT (@konavenkat99) May 15, 2018