Tuesday, May 14, 2024
- Advertisement -

ఇక నుంచి ఆ త‌ర‌హా పాత్ర‌లు చేయ‌నంటున్న రామ్‌చ‌ర‌ణ్ అన్న నిజ‌మేనా…

- Advertisement -

హీరోగా విభిన్నమైన పాత్రలను చేస్తూ వచ్చిన ఆది పినిశెట్టి, ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాడు. దాంతో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలు .. విలన్ పాత్రల వైపు మొగ్గు చూపాడు. ఆ తరహా పాత్రలు మంచి గుర్తింపు తీసుకురావడం .. ఆ సినిమాలు సక్సెస్ కావడం ఆయనకి బాగా కలిసొచ్చింది

ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైనోడు, నిన్ను కోరి, అజ్ఞాత‌వాసి వంటి చిత్రాల‌లో నెగెటివ్ షేడ్‌తో ఉన్న పాత్ర‌ల‌ని పోషించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు ఆది పినిశెట్టి. స‌పోర్టింగ్ రోల్స్‌లోనే కాకుండా హీరోగాను రాణిస్తున్నాడు.

తాజాగా విడుద‌లైన రంగ‌స్థ‌లం చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ సోద‌రుడు కుమార్ బాబు పాత్ర పోషించాడు ఆది. ఇందులో మృదు స్వభావిగా.. గొడవలకు దూరంగా ఉంటూనే అన్యాయంపై పోరాటం చేసే వ్యక్తిగా చక్కగా నటించారు. ఈయ‌న పాత్ర‌కి మంచి అప్లాజ్ వ‌చ్చింది. అయితే హీరోగా ప‌లు సినిమా ఆఫ‌ర్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో కొద్ది రోజుల పాటు విల‌న్ పాత్ర‌ల‌కి దూరంగా ఉండాల‌ని ఆది భావిస్తున్నాడ‌ట‌.

ఆయన హీరోగా సినిమాలు చేయడానికి ముందుకువస్తోన్న దర్శక నిర్మాతల సంఖ్య కూడా పెరుగుతోందట. ఆయనతో జోడీ కట్టడానికి హీరోయిన్స్ ఆసక్తిని చూపుతుండటం విశేషం. దాంతో ఇక విలన్ వేషాలు ఆపేసి .. హీరోగానే చేయాలనే నిర్ణయానికి ఈ యంగ్ విలన్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -