Saturday, May 4, 2024
- Advertisement -

నందమూరి హీరోల తో ఒకే వేదికపై వైఎస్ జగన్

- Advertisement -

కొన్నాళ్ల క్రితం వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు నందమూరి బాలకృష్ణ లు ఇద్దరూ కలిసి ఒక స్టేజ్ పైన కనిపించడమే గగనం అయిపోయింది. అయితే గత కొన్ని నెలలుగా కలిసి కెమెరా ముందుకు వస్తున్న బాబాయ్ అబ్బాయ్ ల తో పాటు ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఒకే స్టేజి పై కనిపించనున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత చిత్రపరిశ్రమకు ప్రతి ఏడాది నంది అవార్డుల ఫంక్షన్ సరిగా జరగడం లేదు. 2014, 2015, 2016 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించింది కానీ అవార్డులు మాత్రం ఇవ్వలేదు.

ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి గా వైకాపా పార్టీ ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇప్పటి దాకా పెండింగ్లో ఉన్న నంది అవార్డులకోసం త్వరలోనే గ్రాండ్ గా ఫంక్షన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందట. 2014 సంవత్సరంలో ఉత్తమ నటుడి అవార్డు లెజెండ్ సినిమాకిగాను బాలయ్యకి దక్కింది. 2015 లో శ్రీమంతుడు సినిమాకి మహేష్ బాబు కి దక్కగా, 2016లో ఉత్తమనటుడిగా నాన్నకు ప్రేమతో మరియు జనతా గ్యారేజ్ సినిమా లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ ఎంపికయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు ఫంక్షన్ అవార్డుల వేడుకను నిర్వహిస్తుంది కాబట్టి ఎన్టీఆర్ బాలయ్య మరియు వైఎస్ జగన్ లను ఒకే వేదికపై చూడగలిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -