సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘ఇదం జగత్’ మూవీవిరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనిల్ శ్రీ కంఠం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి గ్రామంలోని పాదయాత్ర విడిది శిభిరంలో చిత్రయూనిట్ సమక్షంలో ఆయన టీజర్ను రిలీజ్ చేశారు.
టీజర్లో.. ‘ఇక్కడ మనిషి చావు న్యూసే.. మనిషి జ్ఞాపకాలు న్యూసే.. ప్రేమ న్యూసే.. స్నేహం న్యూసే.. చేయాలనుకుంటే ప్రతిదీ న్యూసే అది ఎన్క్యాష్ చేసుకోవడం తెలుసుకోండి. అవసరమైతే ఆ న్యూస్ క్రియేట్ చేయడం కూడా తెలిసుండాలి అది నాకు తెలుసు’ అనే సుమంత్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ హీరోయిన్గా పరిచయమవుతోంది.