- Advertisement -
వైవీఎస్ చౌదరి టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ డైరక్టర్గా పేరు సంపాదించాడు.కని గత కొంత కాలంగా ఫామ్లో లేక తెగ ఇబ్బంది పడుతున్నాడు.తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంది. దీంతో వైవీఎస్ చౌదరిని ఎవరు పట్టించుకోవడం లేదు.గతంలో కొత్త వాళ్లను హీరో హీరోయిన్లగా పెట్టి హిట్లు కొట్టిన వైవీఎస్ చౌదరి, మళ్లీ కొత్తవారితో మూవీ చేయాడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
గతంలో ఆయన నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ కావడంతో ఆయన ఆర్థికంగా తీవ్ర నష్టపోయారు.అప్పులు వల్ల తన ఇల్లుని కూడా అమ్ముకున్నారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. వైవీఎస్ చౌదరి మళ్లీ ఇన్నాళ్లుకు కొత్తవారితో సినిమా చేస్తానని బయటికి వచ్చారు.త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని చెప్పారు.