Wednesday, May 1, 2024
- Advertisement -

ఇలియానాపై బ్యాన్.. ఆ స్టార్ హీరో సినిమాతో గొడవ గొడవ!

- Advertisement -

గోవా హాట్ బ్యూటీ ఇలియానా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకే పరిమితం అయింది. ఇలియానా తెలుగు వెండి తెరపై వైవియస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన “దేవదాసు”సినిమా ద్వారా పరిచయం అయ్యి తర్వాత వచ్చిన పోకిరి, జల్సా, కిక్,రాఖీ వంటి సినిమాల్లో అగ్ర కథానాయకుల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ వున్న సమయంలోనే బాలీవుడ్ వైపు పయనమైంది. అక్కడ మంచి అవకాశాలు దక్కడంతో ఇలియానా బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యిందని అందరూ భావించారు.

తాజాగా ప్రముఖ నిర్మాత కాంట్రగడ్డ ప్రసాద్ ఓ సందర్భంలో మాట్లాడుతూ ఇలియానా మన సౌత్ సినిమాల్లో నటించక పోవడానికి కారణం ఓ తమిళ నిర్మాతతో జరిగిన గొడవే కారణం అనీ తెలియజేశాడు.వివరాల్లోకి వెళితే ప్రముఖ తమిళ నిర్మాత విక్రమ్ హీరోగా నిర్మిస్తున్న “నందం” మూవీలో ఇలియానా హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది.దానికి 40 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఆగిపోవడంతో ఆనిర్మాత డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా ఇలియానాని కోరగా దానికి ఇలియానా ఒప్పుకోలేదనే సమాచారం.

Also read:బాలీవుడ్ లో తెలుగోళ్లు.. ఎవరంటే?

ఈ క్రమంలోనే ఆ నిర్మాత తమిళ నిర్మాతల మండలిని సంప్రదించారు.విషయం అక్కడ కూడా పరిష్కారం కాకపోవడంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ను ఆ నిర్మాత సంప్రదించాడు. అయినా ఇలియానా డబ్బులు వెనక్కి ఇవ్వడానికి ఒప్పుకోలేదు.దాంతో సౌత్ ఇండియా నిర్మాతల మండలి ఆమెను సౌత్ ఇండియన్ సినిమాలలో హీరోయిన్ గా తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నామని, అందుకే ఇలియానా దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి సౌత్ ఇండియా సినిమాలలో కనిపించలేదు అంటూ ప్రముఖ నిర్మాత కాంట్రగడ్డ ప్రసాద్ వివరించాడు.

Also read:హ్యాపీ డేస్ అంటూ యాంకర్ రవి షోకు వచ్చిన టిక్ టాక్ భార్గవ్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -