రాజస్థాన్ లో రెండు వేర్వేరు విషాద ఘటనల్లో 8 మందిని బలి తీసుకుంది. కంటెయినర్, మట్టిపెళ్లల రూపంలో చిన్నారులను మృత్యువు కబలించింది. బికనీర్ జిల్లాలోని హిమ్మతసర్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు ఆడుకుంటూ ఓ కంటెయినర్ లో కి వెళ్లారు. ఆ కంటేయినర్ మూసుకు పోవడంతో ఊపిరి ఆడక చిన్నారులు కన్నుమూశారు. ఇంటికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు ఎంత వెతికినా కనిపించబకపోవడంతో కంగారు పడ్డారు.
అంతా వెతికి చూశారు.. చివరిగా కంటెయినర్ తలుపు తీసి చూడగా ఆపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లగా చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు. చనిపోయిన చిన్నారులను పూనమ్ (8), రవీనా (7), రాధ (5), సేవారామ్ (4), మాలిగా గుర్తించారు.
మరోవైపు ఝన్ ఝన్ లో జరిగిన మరో ఘటనలో ఆడుకుంటున్న పిల్లలపై మట్టిపెళ్లలు విరిగి పడడంతో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. చనిపోయిన చిన్నారులను ప్రిన్స్ (7), సురేశ్ (7), సోనా (10)గా గుర్తించారు. చిన్నారుల మృతి పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంతాపం ప్రకటించారు.
భలే ఛాన్స్ లే..కొత్తవాళ్లకు కూడా పింఛన్లు..!