తెలంగాణ లో కొవిడ్ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. తాజాగా 337 మందికి వైరస్ సోకింది. జీహెచ్ఎంసీ పరిధిలో 91 మంది మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 3,03,455కు పెరిగింది.
వైరస్కు మరో ఇద్దరు బలయ్యారు. ఇప్పటివరకు మహమ్మారితో 1,671 మంది మరణించారు. తాజాగా 181 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,98,826 మంది కొవిడ్ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,958 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 1,226 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. నిన్న 37,079 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
దేశంలో కొవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా 46,951 వేల మందికి వైరస్ సోకింది. మరో 212 మంది చనిపోయారు. 21,180 వైరస్ నుంచి కోలుకున్నారు.
దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల 50 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.కొవిడ్ వ్యాప్తి కట్టడిలో భాగంగా సోమవారం ఒక్కరోజే 8,80,655 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్ టెస్ట్ల సంఖ్య 23 కోట్ల 44 లక్షల దాటింది.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
టాలీవుడ్ ని ఏలేస్తున్న ఈ కుర్రాడో ఎవరో తెలుసా?
‘ఆట నాది, రూ.కోటి మీది’ అంటూ.. ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రొమో!
కోహ్లీ పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు.. నిన్నటి మ్యాచ్ లో..!