దేశంలో రోజు రోజుకీ మహిళలపై చిన్నారులై అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కామాంధులు మాత్రం ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఛత్తీస్గఢ్లోని కోర్బాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ పై అత్యాచారం చేయడమే కాకుండా ఆఫేందుకు వచ్చి ఇద్దరిని హత్య చేశారు దుండగులు. దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాగా, పోలీసుల దర్యాప్తులో అనుమానితుడైన సంత్రం మంఝ్వర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా నిజాలు బయటకు వచ్చాయి.
మంఝ్వర్ అనే వ్యక్తి వద్ద బాలిక తండ్రి (55) గతేడాది జులై నుంచి పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాదిత బాలిక తండ్రి, అతడి మనుమరాలిని తన బైక్ పై తీసుకు వెళ్లాడు. మార్గ మద్యలో మద్యం షాపు వద్ద ఆపి ఆ బాలికను బలవంతంగా అడవిలోకి తీసుక వెళ్లాడు. అతనితో మరికొంత మంది జత అయి సామూహిక అత్యాచారం చేశారు. అడ్డు వచ్చిన బాలిక తండ్రిని, మనుమరాలిని రాళ్లతో కొట్టి చంపారు.
బయటికి వెళ్లిన వారు ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో అనుమానితుడయిన మంఝ్వర్ ను విచారించగా.. విషయం వెలుగు చూసింది. అయితే తీవ్రంగా గాయాలపాలైన బాలిక కూడా మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని మిగిలిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
కరోన వ్యాక్సిన్ పై పీటర్సన్ ట్వీట్, స్పందించిన మోదీ