Saturday, May 4, 2024
- Advertisement -

పేరెంట్స్ బైక్‌నుంచి కింద‌ప‌డినా 300 మీట‌ర్లు బైక్ పైనే చిన్నారి..

- Advertisement -

అదృష్టం ఉంటే అద్భుతం జరుగుతుందని అంటారు. చావు నుంచి ఎవ‌రూ త‌ప్పించుకోలేరు..అదే అదృష్టం ఉంటే చావుకూడా వెన‌క్కు వెల్తుంది. ఆలాంటి సంఘ‌ట‌నే ఇప్పుడు మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ సంఘ‌ట‌న నిజంగా మిరాకిల్ అనుకోవాలో మ‌హాద్భుతం అనుకోవాలో తెలియ‌డంలేదు.

ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ఓ చిన్నారి సురక్షితంగా బయటపడిన వైనం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. న్నపరమేశ్వర్, రేణుక దంపతులు తమ ఐదేళ్ల చిన్నారితో కలసి బేగూరు నుంచి బెంగుళూరుకు బైక్ పై వెళ్తున్నారు. వారికి ముందుగా వెళ్తున్న బైక్ ను చిన్నారి తండ్రి వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో దంపతులిద్దరూ బైక్ పై నుంచి కిందకు పడిపోయారు.

కానీ, వారి బైక్ మాత్రం కిందపడలేదు. ముందు కూర్చున్న చిన్నారితో పాటు దాదాపు 300 మీటర్ల దూరం ప్రయాణించింది. ఆ తర్వాత వేగం తగ్గిన బైక్, రోడ్డుకు పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొంది. దీంతో, ఆ చిన్నారి పక్కన ఉన్న గడ్డిలో పడి, సుక్షితంగా బయట పడింది.

ఈ మొత్తం ఘటన వెనుకనే వస్తున్న ఓ కారు కెమెరాలో రికార్డ్ అయింది. ఆదివారం సాయంత్రం బెంగుళూరు రూరల్ లోని నేలమంగళ ప్రాతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దంపతులిద్దరికీ ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియోను ఓ పోలీసు ట్విట్టర్ లో షేర్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -