అదృష్టం ఉంటే అద్భుతం జరుగుతుందని అంటారు. చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు..అదే అదృష్టం ఉంటే చావుకూడా వెనక్కు వెల్తుంది. ఆలాంటి సంఘటనే ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన నిజంగా మిరాకిల్ అనుకోవాలో మహాద్భుతం అనుకోవాలో తెలియడంలేదు.
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ఓ చిన్నారి సురక్షితంగా బయటపడిన వైనం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. న్నపరమేశ్వర్, రేణుక దంపతులు తమ ఐదేళ్ల చిన్నారితో కలసి బేగూరు నుంచి బెంగుళూరుకు బైక్ పై వెళ్తున్నారు. వారికి ముందుగా వెళ్తున్న బైక్ ను చిన్నారి తండ్రి వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో దంపతులిద్దరూ బైక్ పై నుంచి కిందకు పడిపోయారు.
కానీ, వారి బైక్ మాత్రం కిందపడలేదు. ముందు కూర్చున్న చిన్నారితో పాటు దాదాపు 300 మీటర్ల దూరం ప్రయాణించింది. ఆ తర్వాత వేగం తగ్గిన బైక్, రోడ్డుకు పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొంది. దీంతో, ఆ చిన్నారి పక్కన ఉన్న గడ్డిలో పడి, సుక్షితంగా బయట పడింది.
ఈ మొత్తం ఘటన వెనుకనే వస్తున్న ఓ కారు కెమెరాలో రికార్డ్ అయింది. ఆదివారం సాయంత్రం బెంగుళూరు రూరల్ లోని నేలమంగళ ప్రాతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దంపతులిద్దరికీ ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియోను ఓ పోలీసు ట్విట్టర్ లో షేర్ చేశారు.
Miracles do happen but not all the time, this is what happened at #Bengaluru, parents were travelling with kid and met with accident due to over speed, parents fell down n bike ran with kid for 300 meters, then fall on grass devider. Thank god kid is safe n parents got injured pic.twitter.com/nb9vH8lGiZ
— Nellutla Kavitha (@iamKavithaRao) August 21, 2018