Friday, April 19, 2024
- Advertisement -

కన్న కొడుకును కర్కశంగా హతమార్చిన తండ్రి!

- Advertisement -

కన్న పిల్లలు అంటే తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తమ పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు.. ఉన్నత విద్య కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. వారికి మంచి భవిష్యత్ కోసం ఆస్తి పాస్తులు కూడబెడుతుంటారు. వృద్దాప్యంలో తమను కంటికి రెప్పలా కాపాడుతారని భావిస్తుంటారు తల్లిదండ్రులు. అలాంటిది ఓ కొడుకు నిత్యం మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులను ఇక్కట్లకు గురి చేస్తూ వచ్చాడు. దాంతో విసిగిపోయిన తండ్రి కొడుకును దారుణంగా కడతేర్చాడు.

ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  చేగూరు గ్రామానికి చెందిన గునుగుర్తి నరేష్‌(25) దినసరి కూలీగా చేస్తున్నాడు. ఈ మద్య కాలంలో విపరీతంగా మద్యానికి బానిస అయిన ఈ యువకుడు ఇంటి సభ్యులను డబ్బు కోసం వేధించడం మొదలు పెట్టాడు. ప్రతిరోజూ ఇతని పైశాచికం ఎక్కువ అయ్యింది.  

ఇక ఈ టార్చర్ తట్టుకోలేక తండ్రి అతని ఎల్లయ్య నిద్రిస్తున్న యువకుడి తల, మోహంపై గొడ్డలితో గాయం చేసి వెళ్లిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న యువకుడిని కుటుంబీకులు, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా యువకుడు కన్నుమూశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -