Monday, April 29, 2024
- Advertisement -

కాంగ్రెస్‌లోకి ఆమంచి!

- Advertisement -

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు ఆమంచి. చీరాల నుండి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం గెలుపొందగా ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరారు బలరాం.

ఇక చీరాల టికెట్ ఆమంచికి ఇవ్వకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ తరపున చీరాల నుండి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.వాస్త‌వానికి తాను స్వతంత్రంగానే పోటీ చేయాల‌ని భావించాన‌ని..అయితే త‌న అనుచ‌రుల సూచ‌నల మేర‌కు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్టు చెప్పారు. కాంగ్రెస్ టికెట్‌పై చీరాల నుంచి పోటీ చేస్తాన‌ని చెప్పారు.

చీరాలలో ఆమంచికి మంచి పట్టు ఉంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల స‌మ యంలో తన అనుచరులను స్వ‌తంత్రంగా వారిని నిల‌బెట్టి 52 వార్డుల్లో గెలిపించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -