Wednesday, May 8, 2024
- Advertisement -

చింతమనేని రౌడీ రాజకీయం..ఉద్రిక్తత

- Advertisement -

దెందలూరు నియోజకవర్గం ఒక్కసారి భగ్గముమంది. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో చింతమనేని ప్రభాకర్ రౌడీయిజం ఆగడం లేదు. వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడిన దళితులపై తన అనుచరులతో దాడి చేయించారు చింతమనేని. దీనిపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తలను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబయ్య చౌదరి పరామర్శించారు. ప్రణాళిక ప్రకారం వైసీపీ సానుభూతిపరులపై దాడిచేస్తున్నారని…చింతమనేని ప్రభాకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

పెదేవగి మండలంలో ప్రచారం నిర్వహిస్తున్నారు చింతమనేని.ఆ సమయంలో యర్ర చంటిబాబు అనే యువకుడు వైసీపీ ప్రభుత్వంలో మంచి జరిగిందని తెలిపాడు. దీంతో కోపోద్రిక్తులైన చింతమనేని అనుచరులు..అతడిపై దాడి చేసి చితకబాదారు. చంటిబాబుతో పాటు మరికొంతమందికి గాయాలు కాగా వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే చింతమనేనిపై 93 కేసులు ఉండగా ఎన్నికల ప్రచారంలోనూ తన ప్రవర్తన ఏ మాత్రం మార్చుకోవడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -