Friday, May 3, 2024
- Advertisement -

బాబుకు షాక్..చర్యలకు ఈసీ సిఫారసు!

- Advertisement -

ప్రచార హోరుతో ఏపీలో ఎన్నికల వేడి మరింత హీటెక్కింది. ప్రధాన పార్టీలన్ని ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పల్లెల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఓ వైపు జగన్ మరోవైపు చంద్రబాబు,పవన్,షర్మిల ఎవరికి వారు ప్రచారంలో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలో టీడీపీకి షాక్ ఇచ్చింది ఈసీ. చంద్రబాబుపై చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు ముకేష్ కుమార్ మీనా. సీఎం జగన్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, దీనిపై బాబు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందలేదు ఏపీ సీఈవో. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాష్ కుమార్‌కు లేఖ రాశారు. చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కూడా జతచేశారు. మరి ఏపీ సీఈవో సిఫార్సులపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -