Saturday, May 18, 2024
- Advertisement -

బీజేపీది అక్కడా..ఇక్కడా ఒంటరి పోరే?

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ ఈసారి మరోసారి ఒంటరి పోరుకే సిద్ధమవుతోంది.రీసెంట్‌గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి బరిలోకి దిగినా ఈ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అధికారంలోకి వస్తామని పెద్దపెద్ద మాటలు మాట్లాడి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది బీజేపీ. కేవలం 8 సీట్లు మాత్రమే సాధించింది. ఇక పొత్తుతో నష్టపోయామని భావించారో ఏమో కానీ కమలనాథులు ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదని ప్రకటించింది.

అయితే తెలంగాణలో బీజేపీ సింగిల్‌గా పోటీ చేసినా ఏపీలో మాత్రం టీడీపీ – జనసేన కూటమితో పొత్తు ఉంటుందని ఇప్పటివరకు భావిస్తే వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుకు నో అంటుండగా జనసేనాని మాత్రం పొత్తుకు సై అంటున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం టీడీపీ, జనసేన కూటమితో పొత్తుకు సై అనాలా ? లేదా ఒంటరిగా బరిలోకి దిగలా ? అనే విషయం ఎటు తేల్చుకోలేకున్నారు.

ఇక ఎన్నికల రేసులో వైసీపీ ముందజంలో ఉండగా టీడీపీ – జనసేన అభ్యర్థుల జాబితా సంక్రాంతి తర్వాత వెలువడే అవకాశం ఉంది. అయితే బీజేపీ నేతలు మాత్రం ఇప్పటికి అభ్యర్థుల ఎంపికపై ఉటూ తేల్చుకోలేకపోతోంది. అయితే మెజార్టీ నేతలు మాత్రం గెలుపు, ఓటముల సంగతి పక్కన పెడితే ఒంటరిగా వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారట. దీనిపై ఏపీ బీజేపీ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుండగా బీజేపీ ఒంటరిపోరుకే మొగ్గుచేపుతుందా లేదా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -