Sunday, April 28, 2024
- Advertisement -

బొండా వర్సెస్ వంగవీటి..తగ్గేదెలే!

- Advertisement -

విజయవాడ పాలిటిక్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా బెజవాడ టీడీపీలో రోజుకో కోల్డ్ వార్ ఆ పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే టీడీపీ నేత, సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైసీపీ గూటికి చేరగా ఆపార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. తాజాగా విజయవాడ సెంట్రల్ టీడీపీలో సోషల్ మీడియా వార్ తారాస్థాయికి చేరింది.

సీటు ఆశీస్తున్న ఇద్దరు నేతలు బొండా ఉమా, వంగవీటి రాధా అనుచరులు పోటాపోటీగా పోస్టర్లు వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వంగవీటి రాధాను టీడీపీ నమ్మడం లేదంటూ బొండా ఉమా వర్గీయులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టగా తాజాగా బొండా ఉమాను టార్గెట్ చేస్తూ వంగవీటి రాధా అనుచరులు కౌంటర్ పోస్టులు పెట్టారు.

వంగవీటి రాధాను నమ్మాలంటే ఏం చేయాలంటూ…పదవి కోసం పార్టీని బెదిరించాలా..?.. చిన్న పిల్లల చావుకి కారణం అవ్వాలా..?.. దేవుడి పేరుతో చందాలు పోగెయ్యాలా? అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి గత కొంతకాలంగా విజయవాడ సెంట్రల్ సీట్ కోసం రాధా, ఉమా మధ్య వార్ నడుస్తోంది. ఎన్నికలకు రెండు నెలల సమయం మాత్రమే ఉండగా ఇది కాస్త తారాస్థాయికి చేరింది. మరి దీనిపై చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారోనని తెలుగు తమ్ముళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

విజయవాడ సెంట్రల్ నుండి 2009 ఎన్నికల్లో మల్లాది విష్టు, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బోండా ఉమామహేశ్వరరావు, 2019 ఎన్నికల్లో మల్లాది విష్ణు గెలుపొందారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -