Thursday, May 16, 2024
- Advertisement -

ఊహించిందే..నానికి షాకిచ్చిన బాబు!

- Advertisement -

కొంతకాలంగా విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నడుస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై చంద్రబాబు నాన్చివేత ధోరణిలోనే ఉన్నారు. దీంతో అన్నదమ్ములు కేశినాని నాని – కేశినేని చిన్ని మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇక రీసెంట్‌గా జరిగిన సన్నాహాక సమావేశంలో చిన్ని ఫ్లెక్సీలను చించేశారు నాని వర్గీయులు. దీంతో గొడవ కాస్త ముదిరి పాకాన పడింది.

ఇక తప్పదనుకున్న చంద్రబాబు మరి సాగదీయడం ఎందుకని తేల్చేశారు. విజయవాడ ఎంపీ టిక్కెట్‌ను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని నానినే స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టం రఘురాం, మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ నన్ను కలసి 7 వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇన్‌చార్జ్ గా చంద్రబాబు నియమించారని ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని తెలిపారన్నారు.

పార్టీ వ్యవహారంలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని వారు తనకు తెలిపారని, చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుం డా పాటిస్తానని చెప్పారు. దీంతో విజయవాడ కోల్డ్ వార్‌కు తెరపడగా నాని సైలెంట్‌గా ఉంటారా లేదా వేరే పార్టీ నుం డి పోటీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -