Tuesday, May 7, 2024
- Advertisement -

చంద్రబాబు..అయినను పోయిరావలె హస్తినకు!

- Advertisement -

అయినను పోయిరావలె హస్తినకు ఇప్పుడు ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు పక్కాగా వర్తిస్తుంది. ఎందుకంటే జనసేనతో పొత్తు కన్ఫామ్ చేసుకున్న చంద్రబాబు..బీజేపీతో పొత్తు మాత్రం కాస్త సస్పెన్స్‌గానే ఉంచారు. ఎందుకంటే సీట్ల సంఖ్యే ప్రధాన కారణం అని తెలుస్తోంది. చంద్రబాబు అనుచరులు ఇచ్చిన లీకుల ప్రకారం బీజేపీకి 4 లేదా 5 స్థానాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇక టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించగా బీజేపీకి సంబంధించిన స్థానాలు పెండింగ్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో సీట్ల సంఖ్య ఖరారు చేసేందుకు హస్తినకు పయనం కానున్నారు చంద్రబాబు,పవన్. రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుండగా ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఏపీలో 6 నుంచి 8 ఎంపీ స్థానాలను ఆశిస్తోండగా అన్ని స్థానాలను ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే బీజేపీ తొలి జాబితా ప్రకటించనుండగా దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది అభ్యర్థులు ఉండేలా బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. మార్చి 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండగా ఈలోపే పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -