Monday, May 20, 2024
- Advertisement -

చంద్రబాబు – పవన్ భేటీ..దానిపై చర్చ!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. 2024 మార్చిలో ఏపీలో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సంఖ్య, పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు పలుచోట్ల అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ వస్తున్నారు.

తాజాగా చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు పవన్. పలు కీలక అంశాలతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో పై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయగా అవి అంతగా సత్ఫలితాన్నివ్వడం లేదు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల క్యాడర్‌ని సమన్వయం చేసేందుకు చంద్రబాబు, పవనే స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.

తెలంగాణ ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోండగా అక్కడ అధికార పార్టీ వ్యతిరేకతను కాంగ్రెస్ ఏ విధంగా క్యాచ్ చేసిందో అదే పాలసీని ఏపీలో అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. మొత్తంగా చంద్రబాబు – పవన్ భేటీ కావడం రెండు పార్టీల నేతల్లో జోష్ నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -