Sunday, May 19, 2024
- Advertisement -

వైరల్..పవన్ కు నో చెప్పిన చంద్రబాబు!

- Advertisement -

ఏపీలో టీడీపీ – జనసేన మధ్య సీట్ల సంఖ్య, స్థానాలపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీకి రానుంది. ఈ దిశగా వేగంగా చంద్రబాబు – పవన్ పావులు కదుపుతుండగా ఇక వీరిద్దరి భేటీలో ఓ ఆసక్తికర ప్రస్తావన రాగా దానిని చంద్రబాబు తిరస్కరించినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది..

పవన్ తెలంగాణలో బీజేపీతో ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్నా ఏపీలో మాత్రం టీడీపీతో పొత్తులో ఉన్నారు. ఇక ఏపీలో ప్రధానంగా టీడీపీ -జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్నదానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇక టీడీపీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీతో పొత్తును ఆ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు…పవన్‌తో ఎప్పుడు భేటీ జరిగినా బీజేపీ అంశాన్ని కనీసం లేవనెత్తడం లేదు.

ఈ నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ సందర్భంగా బీజేపీ ప్రస్తావన తీసుకువచ్చారని సమాచారం. బీజేపీతో పొత్తు ఉంటుందని చెప్పాలని చంద్రబాబుకు పవన్ సూచించారట. అయితే దీనిని చంద్రబాబు…పవన్ మొఖంపైనే ఎలాంటి మొహమాటం లేకుండా నో అని చెప్పేశాడని టాక్. దీంతో పవన్ షాక్‌కు గురైన ఏం చేయలేని స్థితిలో ఉండటంతో నోరు మూసుకుని కూర్చున్నారట. ఇప్పుడు ఇదే రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక వైసీపీ నేతలు ఇదే అదునుగా పవన్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ ఆత్మాభిమానం ఎక్కడిపోయింది…ఎంత ప్యాకేజ్ తీసుకున్నంత మాత్రానా ఇంతలా భరించాలా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిపై జనసేన నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -