జోష్ మీదున్న టీడీపీ నేతలకు గట్టి షాక్ తగిలింది. మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ, బీజేపీ నేతలు మురహరిరెడ్డి, కిరణ్ కుమార్, మధు, మల్లికార్జున వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్.
వీరంతా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సీనియర్ నేతలు. కె.ఆర్.మురహరి రెడ్డి (ఎమ్మిగనూరు బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్), కిరణ్ కుమార్ (బీజేపీ ఎమ్మిగనూరు టౌన్ ప్రెసిడెంట్), మాల మధుబాబు (టీడీపీ మాజీ కౌన్సిలర్ – ఎమ్మిగనూరు), చేనేత మల్లికార్జున (టీడీపీ ఎమ్మిగనూరు సిటీ జనరల్ సెక్రటరీ)లలుగా పనిచేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ వైయస్ఆర్సీపీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
