- Advertisement -
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మధ్యంతర బెయిల్ మంజూరైంది. 53 రోజులుగా చంద్రబాబు జైలులో ఉండటంతో అనారోగ్య కారణాల రిత్య బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన బెయిల్ పిటిషన్పై నవంబర్ 10న విచారణ చేపడాతమని తెలిపింది న్యాయస్థానం.
చంద్రబాబు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదనే షరతులు విధించింది. ఇక ఆయన జడ్ కేటగిరి సెక్యూరిటీ కంటిన్యూ అవుతుందని తెలిపింది. ఇక ప్రభుత్వం తరపున లాయర్ల వాదన ప్రకారం చంద్రబాబు…హాస్పిటల్ నుండి ఇంటికి, ఇంటి నుండి హాస్పిటల్కు వెళ్లేందుకు మాత్రమే బెయిల్ ఇచ్చారని తెలిపారు. ఒక స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలోనే మధ్యంతర బెయిల్ వచ్చిందని మిగితా కేసుల్లో బెయిల్ రాలేదని చెప్పారు.
సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు వచ్చే నెల 24 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.