Sunday, May 19, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కాదు జై బాలయ్య!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత పార్టీని అంతా తానై ముందుకు నడిపిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే పార్టీ నేతలతో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి దిశా నిర్దేశం కూడా చేశారు. ఇక చంద్రబాబుకు బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బాబుతో ములాఖత్ జరిపారు ఆయన కుటుంబ సభ్యులు. భార్య భువనేశ్వరి, లోకేష్‌తో పాటు బ్రహ్మాణి కూడా ఉండగా ఈ ములాఖత్‌లో బాబు సూచనల మేరకు నడుచుకుంటున్నారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం నిర్వహించారు లోకేష్, భువనేశ్వరి. ఇక భువనేశ్వరి తొలిసారిగా టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించడం విశేషం.

అయితే టీడీపీలో జరుగుతున్న తాజా పరిణామాలను గమనిస్తే బాలయ్యే పెద్ద దిక్కుగా మారే అవకాశం ఉంది. ఇక మంగళగిరి పార్టీ ఆఫీస్ లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని.. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరినీ కలుస్తానని చెప్పుకొచ్చారు. ఇక పనిలో పనిగా జగన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. మని ఆయన చెప్పుకొచ్చారు.చంద్రబాబు కూర్చునే ఛైర్లోనే కూర్చోవడం.. బాబు మాదిరే టీడీపీ శ్రేణులకు దిశ నిర్దేశం చేయడంలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు బాలయ్య బాబు. దీంతో చంద్రబాబు బయటకు వచ్చే వరకు అంతా బాలయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇక బాలయ్య ఎంట్రీతో జూనియర్ ఎన్టీఆర్ పేరు కనుమరుగైంది. పలు పార్టీల నేతలు చంద్రబాబు అరెస్ట్‌ పై స్పందిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం లోకేష్‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు. అయితే ఎన్టీఆర్ మాత్రం మౌనం వీడటం లేదు. గతంలో పార్టీలో జరిగిన అవమానాల నేపథ్యంలోనే ఎన్టీఆర్ స్పందించడం లేదట. మొత్తంగా టీడీపీలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -