Monday, May 20, 2024
- Advertisement -

బాబుకు ఊహించని షాకే..సీఎం పదవి ఇస్తేనే!

- Advertisement -

టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీలో చేరుతుందా లేదా అన్న సస్పెన్స్‌కు ఇంకా తెరపడటం లేదు. టీడీపీతో పొత్తు అంశాన్ని బీజేపీ అధిష్టానానికి అప్పగిస్తూనే మరోవైపు ఒంటరిపోరు అనే సంకేతాలిస్తూ వస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు.

అయితే పవన్ – చంద్రబాబు మాత్రం బీజేపీని కలుపుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇవాళో,రేపో ఢిల్లీకి వెళ్లనున్నారు పవన్ – చంద్రబాబు. ఇక్కడే పొత్తుపై ప్రకటన చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ పెట్టిన డిమాండ్‌లతో చంద్రబాబు షాక్ తిన్నారని తెలుస్తోంది.

కూటమితో కలవాలంటే 12 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్ సభ సీట్లు ఇవ్వడమే కాకుండగా సీఎం అభ్యర్థిగా బీజేపీ నేతే ఉండాలని డిమాండ్ చేస్తున్నారట. ఇదే ఇప్పుడు టీడీపీ – జనసేన నేతలకు కొత్త చిక్కు తెచ్చిపెడుతోంది. అయితే కమలం పార్టీ చేస్తున్న డిమాండ్ కు పవన్, చంద్రబాబు అంగీకరిస్తారా అంటే డౌటే. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని చంద్రబాబు ఎలా కన్విన్స్ చేస్తారనేది వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -