ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై ఆ పార్టీ నుండే కాదు అధికార వైసీపీ నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా సొంత పార్టీ నేతలపై పురందేశ్వరిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పురందేశ్వరి బీజేపీ కోసం కాకుండా టీడీపీ కోసమే పనిచేస్తుందని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై పురందేశ్వరి సైతం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట.
ప్రధానంగా టీడీపీ తో పొత్తు లేదని బీజేపీ పెద్దలు చెబుతున్నప్పటికి పురందేశ్వరి మాత్రం అధిష్టానం ఆదేశాలను ధిక్కరిస్తుండటమే రాష్ట్ర బీజేపీ నేతల కోపానికి కారణమని సమాచారం. ఇక తన అనుకూల వర్గానికే ఆమె పెద్ద పీట వేస్తుండటంతో బహిరంగంగానే బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.అందుకే పురందేశ్వరి టీడీపీ కోవర్ట్ లా పని చేస్తున్నారనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అసలే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటో తెలియని సిచ్యువేషన్. ఇప్పుడు ఏపీ బీజేపీలో లొసుగులు బయట పడుతుండటం ఆ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిని తిరిగి గాడిన పెట్టేందుకు జాతీయ నేతలు రంగంలోకి దిగుతున్నప్పటికి ఫలితం కనిపించడం లేదు. ఇక ఏపీ బీజేపీ నేతలను సైతం తెలంగాణ ప్రచారంలో ఉపయోగించుకోవాలని చూస్తే.. అక్కడేమో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కోవర్ట్ రాజకీయం ఆరోపణలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరి బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి..