Sunday, April 28, 2024
- Advertisement -

3 లక్షల మందితో జగన్ మీటింగ్!

- Advertisement -

వైనాట్ 175…ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత, సీఎం జగన్ ముందున్న టార్గెట్. రెండోసారి వైసీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు జగన్. ఓ వైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి జోడెడ్లుగా పాలన సాగించిన జగన్‌..అదే తనను తిరుగులేని మెజార్టీతో మరోసారి అధికారం కట్టబెడుతుందని భావిస్తున్నారు.

ఇక ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకుంటుండగా త్వరలోనే పార్టీ క్యాడర్‌తో భేటీ అయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కవర్ అయ్యే విధంగా 4-6 జిల్లాలను కలిపి ఒక రీజియన్‌గా సమావేశం నిర్వహించేందు సిద్ధమవుతున్నారు. తద్వారా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు భవిష్యత్ ప్రణాళికు కేడర్‌కు వివరించే ప్రయత్నం చేయనున్నారు జగన్. పార్టీ సభ్యులందరినీ ఏకంచేసి, వారిలో చైతన్యం నింపుతూ ఎన్నికలకు సమాయత్తం చేసేలా ఈ సమావేశాలు ఉండనున్నాయి.

తొలి సమావేశం జనవరి 25న విశాఖపట్నం, భీమిలిలో జరగనుంది. త్వరలోనే మిగిలిన 4 రీజియన్ల సమావేశాలు, ప్రాంతాల వివరాలను వెల్లడించనున్నారు. ఇక ఈ సమావేశాల మీటింగ్‌కు దాదాపు 3 లక్షల మంది వస్తారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లోనే సిట్టింగ్‌ల మార్పు, నాయకులు, కార్యకర్తలకు వారి భవిష్యత్‌పై భరోసా ఇవ్వనున్నారు జగన్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -