టీడీపీ – జనసేన పొత్తులో పవన్ పార్టీకి 27 నుండి 30 అసెంబ్లీ స్థానాలు,2 ఎంపీ సీట్లు ఇస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉండగా సోషల్ మీడియాలో మాత్రం జనసేన నుండి పోటీ చేసేది వీరే అంటూ ఓ లిస్ట్ వైరల్గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్ ప్రకారం..భీమవరం – కొణిదెల పవన్ కల్యాణ్,తెనాలి – నాదెండ్ల మనోహర్,గజపతినగరం – పడాల అరుణ, గాజువాక – సుందరపు సతీష్ ,భీమిలి – పంచకర్ల సందీప్, పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు ,యలమంచిలి – సుందరపు విజయకుమార్ ,ముమ్మిడివరం – పితాని బాలకృష్ణ ,రాజానగరం – బత్తుల బలరామకృష్ణ ,రాజమండ్రి రూరల్ – కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ – పితాని నానాజీ, పిఠాపురం – ఉదయ్ శ్రీనివాస్, రామచంద్రాపురం – చిక్కం దొరబాబు ,జగ్గంపేట – పటంశెట్టి సూర్యచంద్ర రావు ,రాజోలు – డీఎంఆర్ శేఖర్, ,తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం – బొమ్మిడి నాయకర్ ,విజయవాడ వెస్ట్ – పోతిన మహేష్, గిద్దలూరు – ఆమంచి శ్రీనివాస రావు పేర్లు వైరల్గా మారాయి.
అయితే పవన్ రెండు చోట్లా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఒకటి భీమవరం కన్ఫామ్ కాగా మరోకటి రాయలసీమ నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి రాలేదని నేతలు చెబుతున్నారు. ఎందుకంటే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి రెండేసి అసెంబ్లీ సీట్లు లేదా కొన్ని స్థానాల్లో ఒక సీటు అయినా కేటాయించాలని టీడీపీపై ఒత్తిడి తెస్తున్నారు. మరి సీట్ల సంఖ్య, స్థానాలపై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచిచూడాల్సిందే.