టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్తో రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయారు పవన్ కళ్యాణ్. టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్…ఏపీలో పోటీ చేసే స్ధానాలపై దృష్టిసారించారు. దాదాపు 30కి పైగా స్ధానాల్లో పవన్ పోటీ చేసే అవకాశం ఉండగా ఇక తెలంగాణపై దృష్టిసారించారు జనసేనాని.
ఏపీ కంటే ముందే తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించారు పవన్. ఇంతవరకు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు కానీ కనీసం తెలంగాణ నేతలతో సమావేశాలు నిర్వహించలేదు. అయితే తాజాగా ఆ పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 40 స్ధానాల్లో జనసేన పోటీచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ వైపు ఏపీ మరోవైపు తెలంగాణ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకుసాగాలని నిర్ణయించారట.
అయితే తెలంగాణలో ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగనున్నారట పవన్. ఎందుకంటే ఏపీలో టీడీపీతో కలిసి పోటీచేస్తానని ఇప్పటికే ప్రకటించగా బీజేపీ ఈ కూటమిలో చేరుతుందా లేదా అన్నది ఇంకా సందిగ్దమే. ఒకవేళ జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేస్తే తెలంగాణలో కూడా జనసేన – బీజేపీ మధ్య పొత్త పొడిచే అవకాశం ఉంది. ఏదిఏమైనా పొత్తు ఉన్నా లేకున్నా ఒంటరిగానైనా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మరి పవన్ తెలంగాణలో ఖాతా తెరుస్తారా లేదా అన్నది వేచిచూడాల్సిందే.