డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా అందుబాటులో లేదని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో సగానికి పైగా నిధులు వివిధ సంక్షేమ పథకాలకే వెళ్తున్నాయని, అభివృద్ధి పనులకు సరిపడా నిధులు కేటాయించడంలేదని ఆయన విమర్శించారు. మున్సిపాలిటీలకు విడుదల కావాల్సిన గ్రాంట్లు ఆలస్యమవడంతో పట్టణాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
ప్రజలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న డ్రైనేజీ దుర్వాసన, తాగునీటి కొరత, గుంతల రోడ్ల సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం మున్సిపాలిటీలకు నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి లేకుండా కేవలం పథకాలతోనే రాష్ట్రం ముందుకు వెళ్లలేదని, మౌలిక వసతుల బలోపేతానికి ప్రత్యేక ప్రణాళిక అవసరమని సూచించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.
