Sunday, May 5, 2024
- Advertisement -

చంద్రబాబుకు కాసాని ఝలక్..లోకేష్‌ చిక్కడు దొరకడు!

- Advertisement -

చంద్రబాబుపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్. తెలంగాణలో టీడీపీ పోటికి విముఖత చూపించడంతో ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబు విధానం తనకు నచ్చలేదని…ఎందుకు పోటీ నుండి తప్పుకున్నాడో ఆయనకే తెలియాలన్నారు. ఇక పనిలో పనిగా లోకేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాసాని.

లోకేష్ ఎవరికి దొరకడని…అసలు ఫోనే ఎత్తరని మండిపడ్డారు. హైదరాబాద్‌లోనే ఉన్నా పట్టించుకోలేదన్నారు. ఇక బాలయ్య చిటికెలు వేసి తోడలు గొట్టి అటు నుండి అటే పరరాయ్యారని దుయ్యబట్టారు. ఈ దొరలు అసలు ఫోనే ఎత్తరని…ఎందుకు పార్టీ నడుపుతున్నారో వారికే తెలియాలన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన తాను ఎన్నికల బరిలో ఉండితీరుతానని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో నిలబడనప్పుడు పార్టీ ఎందుకని…లోకేష్ దగ్గరికి వెళ్తే కనీసం మాట్లాడలేదన్నారు. చిల్లి గవ్వ కూడా పార్టీ నుండి తీసుకోలేదని…ఇప్పటివరకు తన సొంత డబ్బులతోనే పార్టీని నడిపానని చెప్పారు.

కాసాని జ్ఞానేశ్వర్‌కి ముదిరాజ్ సామాజిక వర్గంలో మంచి పట్టుంది. గతంలో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీగా గెలుపొందారు. కాంగ్రెస్ అగ్రనాయకుల్లో మంచి ఇమేజ్ కూడా ఉంది. అయితే రీసెంట్‌గా టీడీపీలో చేరిన ఆయనకు పార్టీ పగ్గాలు అప్పజెప్పారు చంద్రబాబు. దీంతో 85 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే చంద్రబాబు పోటీకి విముఖత చూపించడంతో తీవ్రంగా మండిపడ్డారు.అనంతరం టీటీడీపీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -