తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తన వ్యవసాయక్షేత్రంలో బాత్రూమ్లో మాజీ సీఎం కేసీఆర్ జారి పడిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తుంటి ఎముకకు గాయం కాగా యశోద ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా సర్జరీ చేశారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్..ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇక ఫిబ్రవరిలోనే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తారా లేదా అన్న సస్పెన్స్కు తెర పడింది. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాటలోనే ప్రచారం చేయనున్నారు కేసీఆర్. కారు ప్రమాదంలో కాలుకు గాయం కాగా మమతా వీల్ చైర్లోనే బెంగాల్ అంతా చుట్టివచ్చారు. ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ కావడమే కాదు తృణమూల్ తిరుగులేని మెజార్టీతో విజయం సాధించింది.
ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు కేసీఆర్. వీల్ చైర్లో ప్రచారం చేస్తూ ఓటర్ల సానుభూతి పొందేం ప్రయత్నం చేయనున్నారట. అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజూ రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మొత్తంగా వీల్ చైర్లో రాష్ట్రమంతా పర్యటించాలని డిసైడ్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.