Sunday, May 19, 2024
- Advertisement -

డోన్ బరిలో కేఈ..చంద్రబాబుకు షాక్!

- Advertisement -

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది. రెండు సంవత్సరాల క్రితం డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటించారు చంద్రబాబు. టీడీపీ ప్రకటించిన తొలి అభ్యర్ధి, ప్రకటించిన స్థానం కూడా ఇదే. ఇక అప్పటినుండి తానే అభ్యర్థినని ప్రచారం చేసుకోవడమే కాదు గ్రామగ్రామాల్లో తిరుగుతున్నారు సుబ్బారెడ్డి.

అయితే తాజాగా సీన్ కట్ చేస్తే టీడీసీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత తెరపైకి వచ్చారు. డోన్‌లో రాజకీయంగా పలుకుబడి ఉన్న కేఈ…ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం ఉండగానే తాను రేసులో ఉన్నానని ప్రకటించారు. దీంతో చంద్రబాబుకు షాక్ తగిలింది.డోన్ నుండి ఈసారి ఎన్నికల బరిలో నిలిచి తీరుతానని తెలిపారు.

199లో డోన్ నుండి గెలుపొందిన కేఈ..తర్వాత బాబు సూచన మేరకు 2009లో పత్తికొండకు మారి గెలుపొందారు. తాజాగా డోన్ నుండి ఈ సారి పోటీ చేస్తానని తెలిపిన కేఈ…ఉమ్మడి కర్నూల్ జిల్లాలో తనకు ఐదు నియోజకవర్గాల్లో పట్టు ఉందని తెలిపారు. ఇక తాజాగా టీడీపీకి కేఈ ప్రభాకర్ ఇచ్చిన షాక్‌తో తెలుగు తమ్ముళ్లు కలవరానికి గురవుతుండగా ఇదే స్థానం నుండి వైసీపీ తరపున మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పోటీ చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -