Saturday, May 4, 2024
- Advertisement -

జగన్ జైత్రయాత్రను ఆపలేరు!

- Advertisement -

టీడీపీ నేత నారా లోకేష్ యువగళం విజయోత్సవ సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్‌,బాలకృష్ణ హాజరైన సంగతి తెలిసిందే. ఇక ఈ సభ విజయవంతమైందని టీడీపీ నేతలు భావిస్తుండగా వైసీపీ నేతలు మాత్రం తమదైన శైలీలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రధానంగా మాజీ మంత్రి కొడాలి నాని…చంద్రబాబు,పవన్,లోకేష్‌పై చేసిన విమర్శలు హాట్ టాపిక్‌గా మారాయి. అడుగు ఊడిపోయిన బక్కెట్ గాళ్లంతా నిన్నచేసింది పిల్లి మెడలో గంటకట్టే ప్రయత్నమేనని చురకలు అంటించారు. సీఎం జగన్ 2009 సెప్టెంబర్ 2నే యుద్ధం మొదలు పెట్టారు..కానీ ఇప్పుడు వీళ్లంతా ఏదో పొడిచేసినట్లు చెబుతుండటం సిగ్గుచేటన్నారు.

12ఏళ్ల క్రితమే జగన్ యుద్ధభేరి మోగించి… సోనియాను కూకటివేళ్లతో పెకలించేశారన్నారు. పవన్ కళ్యాణ్ ను రెండుచోట్ల చిత్తు చేస్తూ…చంద్రబాబును భూస్థాపితం చేసి.. మంగళగిరిలో లోకేశ్ కు సమాధి కట్టాడని తనదైన శైలీలో చెప్పుకొచ్చారు. ఈ ముగ్గురు ఎన్ని కుట్రలు చేసినా జగన్ జైత్రయాత్రను ఆపలేరన్నారు. 30ఏళ్ల క్రితమే చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ట్రాన్స్ ఫర్ అయ్యారని… లోకేశ్ పుట్టింది మంగళగిరిలోనా..? పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకలో గోలీలు ఆడుకున్నాడా? చెప్పాలని ప్రశ్నించారు. ఈ ముగ్గురు కలిసినా జగన్ చిటికెన వేలు కూడా కదపలేరని చురకలు అంటించారు నాని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -