Sunday, May 19, 2024
- Advertisement -

జనసేన నేతల మూకుమ్మడి రాజీనామా

- Advertisement -

ఓ వైపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీగా ఉండగా మరోవైపు ఏపీలో రాజీనామా బాట పడుతున్నారు జనసైనికులు. నిన్న పవన్‌కు అత్యంత సన్నిహితులైన పసుపులేటి సందీప్ రాయల్,పద్మావతి రాజీనామా చేయగా తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన జనసేన నాయకులు మూకుమ్మడి రాజీనామా చేశారు.

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన డాక్టర్ మాచర్ల రామకృష్ణ అలియాస్ ఆర్కే జనసేనకు రిజైన్ చేశారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున అనుచరులతో రాజీనామా బాటపట్టారు. ఈ సందర్భంగా పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు ఆర్కే.

రాష్ట్రస్థాయిలో జనసేనలో మంచి ఊపు వచ్చినా క్షేత్రస్ధాయిలో మాత్రం జనసేన నాయకత్వంలో మార్పు రాలేదని ఆరోపించారు. తమకు పార్టీలో తగిన గుర్తింపు లేదని, అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఇక ఇదేబాటలో మరికొంతమంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -