Tuesday, April 30, 2024
- Advertisement -

లోకేష్ మళ్లీ రెడీ….ఈసారైనా కంటిన్యూ చేస్తారా?

- Advertisement -

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను తిరిగి చేపట్టనున్నారు. ఈ నెల 24 నుండి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుండి తిరిగి ప్రారంభించనున్నారు. ఇక ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు కండీషన్స్‌తో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఈసారి యాత్రను కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు లోకేష్. అయితే ఒక్క స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులోనే బాబుకు రిలీఫ్ లభించింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం,ఫైబర్ నెట్ స్కాం,లిక్కర్ స్కాం, సాండ్ స్కాం ఇలా పలు కేసుల్లో ఆయనకు ఇంకా రిలీఫ్ దక్కలేదు. దీంతో ఈ కేసుల్లో ఏదో ఒకదాంట్లో అరెస్ట్ అయినా ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ శ్రేణులే భావిస్తున్నాయి. అయితే లోకేష్ మాత్రం ఈ సారి యాత్రను కంప్లీట్ చేయాలనే ధీమాతోనే ఉన్నారట. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలే సమయం ఉంది.అందుకే యాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువకావాలని భావిస్తున్నారు లోకేష్.

అయితే యాత్ర ప్రారంభించినప్పుడు అనుకున్నట్టుగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు యాత్ర చేయడం లేదు. వైజాగ్‌లోనే యాత్రకు పుల్ స్టాప్ పెట్టనున్నారట లోకేష్. దీనిపై పార్టీ నేతల నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -