విజయవాడ సెంట్రల్లో అసంతృప్తి వీగిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు మౌనం వీడారు. కొన్నాళ్లుగా వైసీపీ అధిష్టానం తీరుపై విష్ణు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తుండగా అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఒకే ఒక హాగ్తో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని తేల్చిపారేశారు విష్ణు. తన ఆఫీస్ నుండి వెల్లంపల్లి ఆఫీస్కు ర్యాలీగా వెళ్లిన విష్ణు..వెల్లంపల్లిని ఆత్మీచ ఆలింగనం చేసుకున్నారు. దీంతో విజయవాడ సెంట్రల్ వైసీపీలో సంబరాలు అంబరాన్నంటాయి.
వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుని కాదని ఆయన స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ను ఇంఛార్జీగా నియమించారు జగన్. అప్పటి నుండి విష్ణు మౌనంగా ఉండిపోగా ఆయన్ని సంప్రదించేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నించినా సైలెంట్గానే ఉండిపోయారు విష్ణు. దీంతో ఎల్లో మీడియాలో విజయవాడ సెంట్రల్లో వైసీపీ విభేదాలపై రచ్చరచ్చ చేశారు.
అయితే కార్పొరేటర్లు అంతా వెల్లంపల్లి వెంటే నడవగా తాజాగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ సమావేశంలో పాల్గొన్న విష్ణు.. అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యం అని కేడర్ కు తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. విష్ణు రాకతో వెల్లంపల్లికి రూట్ క్లియర్ కాగా వైసీపీ కేడర్ ఆనందంలో మునిగిపోయారు.