టీడీపీ – బీజేపీ పొత్తులో పావులా మారారు జనసేన అధినేత, పవన్ కళ్యాణ్. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లను త్యాగం చేస్తూ జనసైనికుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక తాజాగా మెగాబ్రదర్ నాగబాబు వంతు వచ్చేసింది. అనకాపల్లి సీటు ఆశీంచిన నాగబాబు అక్కడకు మకాం కూడా మర్చారు. అయితే తీరా ఈ సీటు వచ్చే అవకాశం లేకపోవడంతో పవన్కు సైతం దూరంగా ఉండిపోయారు నాగబాబు.
ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత అన్న నాగబాబుకు కూడా పవన్ అన్యాయం చేశారని ఆయనకు మతిస్థిమితం లేదని ఎద్దేవా చేశారు.
పవన్ను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపించాలని …పవన్ కళ్యాణ్ పక్కనున్న కాపు నాయకులు ఎందుకు ఆయనకు దూరంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ వైఖరి నచ్చక ఆయ అన్న నాగబాబు ఫోన్ స్విచాఫ్ చేశారన్నారు. స్థానికంగా ఉన్న నన్ను తరిమి కొట్టాలని పవన్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజా సేవ నా బ్లడ్లోనే ఉందని…పవన్ వ్యవహార తీరు వల్లే 2019లో ఆయన్ని భీమవరం నుండి తరిమికొట్టారని మండిపడ్డారు.