Saturday, April 27, 2024
- Advertisement -

ఢిల్లీ నుండి ఏపీకి లోకేష్‌..ఇంకాస్తా టెన్షన్ పెంచేందుకేనా?

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు ఆరోగ్యంపై మిక్సడ్ టాక్ నడుస్తోంది. తొలుత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఎల్లో మీడియా విష ప్రచారం చిమ్మింది. జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోందని..ఆయన 5 కిలోలు తగ్గారని విస్తృత ప్రచారం చేశారు. దీంతో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొని ఉంది. అయితే తర్వాత జైళ్ల శాఖ డీజీపీ చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించడంతో ప్రజలు వాస్తవాలను తెలుసుకున్నారు. నెల రోజుల్లో జైళ్లో చంద్రబాబు కేజీ బరువు పెరిగారు. ఇక బాబు ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..పూర్తి భద్రత మధ్య చంద్రబాబు ఉన్నారని చెప్పారు.

దీంతో ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా చేసిన ఫేక్ ప్రచారానికి బ్రేక్ పడింది. ఇది లాభం లేదనుకున్నారో ఏమో తెలియదు కానీ హస్తినలో ఉన్న లోకేష్ హుటాహుటిన ఏపీకి పయనమయ్యారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి నేరుగా రాజమండ్రికి చేరుకున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్న లోకేష్ హస్తినకు రావడం వెనుక మరేదైన కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో ముఖ్యంగా టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా ఏదైనా కార్యాచరణ చేపట్టే అవకాశం ఉందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టీడీపీ నేతలు ఇప్పటికి చంద్రబాబు ఆరోగ్యం, స్టెరాయిడ్స్ అనే ప్రచారాన్ని కంటిన్యూ చేస్తుండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. మరి లోకేష్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది,భవిష్యత్ కార్యచరణ ఏం ప్రకటిస్తారనే దానిపై టీడీపీ శ్రేణుల్లో అయితే ఉత్కంఠ నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -