Tuesday, May 21, 2024
- Advertisement -

అవును… నిజం గెలవాలి!

- Advertisement -

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఇప్పట్లో బెయిల్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటివరకు బెయిల్ వస్తుందని ఆశించిన టీడీపీ నేతలు ఇక ఆశలు వదలుకోగా ప్లాన్ బీని ఇంప్లిమెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా నారా లోకేష్ తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి భవిష్యత్ గ్యారెంటీ పేరుతో తల్లి భువనేశ్వరి పేరుతో బస్సుయాత్ర చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా నిజం గెలవాలి అని భువనేశ్వరి కొత్త నినాదాన్ని ఎంచుకోగా దీనికి నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటివరకు అబద్దం గెలవడం వల్లే చంద్రబాబు బయట ఉన్నారని, లేటుగానైనా నిజం గెలవడంతో బాబు జైల్లో ఉన్నారని చురకలు అంటిస్తున్నారు. గతంలో వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్ల చంద్రబాబు ఆడింది ఆటైంది..కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంలో కటకటాలు లెక్కబెడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

చంద్రబాబు రాజకీయ జీవితంలో చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని చెబుతున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దగ్గరి నుండి అమరావతి నిర్మాణం పేరుతో జరిగిన స్కాంల దగ్గరి వరకు చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌ని పడగొట్టేందుకు బాబు చేయని ప్రయత్నాలు లేవు. అందుకే ఇప్పుడు తగిన మూల్యం చెల్లిస్తున్నారని అందుకే భువనేశ్వరి లేటుగానైనా నిజం గెలుస్తుందని అభిప్రాయపడ్డారని చురకలు అంటిస్తున్నారు. అందుకే భవనేశ్వరి నిజం గెలవాలనే కోరిక నెరవేరి బాబు జైలు పాలయ్యారని నెటిజన్లు కామెంట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదిఏమైనా చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగానే తయారైందని ఆ పార్టీ నేతలే భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -