ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. నాలుగు వారాల పాటు చంద్రబాబుకు కండీషన్స్తో కూడిన బెయిల్ని మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే బెయిల్ మంజూరైన చంద్రబాబు పార్టీ నేతలను కలిసే అవకాశం లేదు.
ఇక చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో బాలయ్య యాక్టివ్ పాలిటిక్స్లో ఫుల్ స్వింగ్లోకి వచ్చేశారు. ఓ వారం రోజుల పాటు అంతా తానై వ్యవహారించారు. ఒకానొక దశలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ వ్యాఖ్యానించారు. కానీ సీన్ కట్ చేస్తే అంతే స్పీడులో బాలయ్యను సైడ్ చేసేశారు చంద్రబాబు.
బాలయ్యను పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకూడదని చంద్రబాబు హుకుం జారీ చేయడంతో అంతా ఖంగుతిన్నారు. అప్పటివరకు టీడీపీ నిర్ణయాల్లో తన మార్క్ చూపించిన బాలకృష్ణను చంద్రబాబు నిర్ణయం తర్వాత పక్కన పెట్టడంతో బాలయ్య బాబే కాదు టీడీపీ నేతలుసైతం ఖంగుతిన్నారు.ఇక బాలయ్య తెలంగాణలో పోటీ చేస్తుందని తాను ప్రచారం చేస్తానని ప్రకటించినా బాబు నిర్ణయంతో టీటీడీపీ పోటీకే దూరమై పోయింది. దీంతో బాలయ్యకు తీవ్ర అవమానం జరిగింది. బాబుకి కావలసినప్పుడు బాలయ్య స్పందించాలి కానీ కీలక నిర్ణయాల సమయంలో మా అభిమాన హీరోను ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి తరుణంలో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో ఇక బాలయ్య యాక్టివ్ పాలిటిక్స్కు దూరం కాక తప్పదనే వాదన వినిపిస్తోంది.