- Advertisement -

బెంగాల్‌లో 58 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు

- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో నెల రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ తర్వాత, భారత ఎన్నికల కమిషన్ (ECI) మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాలను విడుదల చేసింది. తొలగింపుకు గుర్తించిన ఓటర్ల పేర్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈసీఐ ఓటర్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి.

వర్గాల వారీగా చూస్తే, 58,08,202 మంది ఓటర్ల పేర్లు తొలగింపుకు గుర్తించబడ్డాయి. ప్రస్తుతం బెంగాల్‌లో 24,18,699 మంది మరణించిన ఓటర్ల పేర్లు ఇంకా జాబితాలో ఉన్నట్లు, 19,93,087 మంది చిరునామా మార్చినట్లు, 12,01,462 మంది గుర్తించబడలేకపోయినట్లు, అలాగే 1,37,575 మంది మోసపూరిత ఓటర్లుగా తేలినట్లు వర్గాలు తెలిపాయి. అదనంగా 57,509 మంది ‘ఇతర’ కేటగిరీలో పెట్టి తొలగించనున్నట్లు పేర్కొన్నారు.

2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 58.8 లక్షల ఓటర్ల పేర్లు తొలగించే నిర్ణయం బెంగాల్‌లో పెద్ద రాజకీయ వివాదానికి దారితీయనుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఈ ప్రక్రియను తీవ్రంగా విమర్శిస్తూ వెంటనే ఆపాలని ఈసీని కోరింది. ఈ చర్య బెంగాళ్లను రాష్ట్రం వెలుపలికి నెట్టే ప్రయత్నమని టీఎంసీ ఆరోపించింది. అయితే ఈసీ ఈ ఆరోపణలను ఖండిస్తూ, బూత్ లెవల్ ఆఫీసర్లపై ఒత్తిడి తేవద్దని సూచించింది.

మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ టీఎంసీపై విమర్శలు గుప్పిస్తూ, అక్రమ వలసదారుల ఓట్లపై ఆధారపడటమే టీఎంసీ భయమని ఆరోపించింది.

ఓట్ల తేడాల మార్పు: 3% నుంచి 10%కి, అక్కడి నుంచి 7%కి

ఈ మార్పులు రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి.

2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ 22 సీట్లు, బీజేపీ 18 సీట్లు గెలిచాయి. ఓట్ల తేడా 3.05%.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 48.02% ఓట్లు, బీజేపీ 37.97% ఓట్లు సాధించాయి. తేడా 10.05%; టీఎంసీ 215 సీట్లు గెలిచింది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ 46.16%, బీజేపీ 39.08% ఓట్లు పొందాయి. ఓట్ల తేడా 7.08%.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -