Sunday, May 19, 2024
- Advertisement -

కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ మాజీ మంత్రి?

- Advertisement -

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. కేసీఆర్ పార్టీని వీడి ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఆయన భార్య వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధమైంది. గురువారం సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు మహేందర్ రెడ్డి. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు రోహన్ రెడ్డితో పాటు మంత్రి దామోదర రాజనర్సింహా, వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సీఎంను కలిసిన అనంతరం మాట్లాడిన సునీతా మహేందర్ రెడ్డి…వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరుతామని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టు ఉన్న నేత పట్నం. ఇక మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే బీఆర్ఎస్‌కు గట్టి షాక్ తగిలినట్లు అవుతుంది. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధమైంది. పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో హస్తం గూటికి చేరారు.

20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడిన కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరికల పర్వం కొనసాగుతోండటం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -