Monday, April 29, 2024
- Advertisement -

జగన్‌పై దాడి కేసు..మరో 16 టీంలు ఏర్పాటు

- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం యాత్రను జగన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక శనివారం విజయవాడలో బస్సుయాత్ర సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి జగన్‌పై రాయి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జగన్‌ గాయం భారీన పడ్డారు.

ఈ కేసు విచారణను వేగవంతం చేశారు విజయవాడ పోలీసులు. ఇప్పటికే ఆరు టీంలు ఏర్పాటు చేయగా తాజాగా మరో 16 టీంలను ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అనుమానితులను విచారిస్తుండగా దాడి చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

స్కూల్, టెంపుల్ మధ్య బహిరంగ ప్రాంతం నుంచి దాడి జరిగినట్లు పోలీసులు నిర్దారణకు రాగా టాస్క్ ఫోర్స్‌ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది. దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే వివరాలను కోరింది. హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -