Thursday, May 9, 2024
- Advertisement -

టీడీపీలో అంతే..హామీ ఇచ్చి మర్చిపోతారు!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం బెయిల్ రద్దుపై డిసెంబ్ 8లోగా లిఖిత పూర్వక కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే బెయిల్ రద్దుపై విచారణ చేపడతామని వెల్లడించింది.

ఇక చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలను ఎల్లో మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక 150 మంది చనిపోయారని తెగ ప్రచారం చేశారు. ఈ సానుభూతిని క్యాచ్ చేసుకునేందుకు నారా భువనేశ్వరి బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సాయం అందజేస్తారని ఉదరగొట్టారు. కానీ కేవలం 3 కుటుంబాలకు మూడు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

ఈలోగా చంద్రబాబు బయటకు రావడంతో నిజం గెలవాలి యాత్రను అటకెక్కించి మిగితా కుటుంబాల సంగతే మర్చిపోయారు. ఎల్లో మీడియా సైతం కనీసం వారి పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఇక వాస్తవానికి టీడీపీ, చంద్రబాబుకు హామీలిచ్చి మర్చిపోవడం ఇది కొత్తేమీ కాదు. ఆశ పెట్టుకున్న వారిని నట్టేట ముంచేయడం చంద్రబాబుకు అలవాటే. మనషులనే కాదు మేనిఫెస్టోను సైతం మాయం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే తెలుగుదేశం వాగ్దానాలు, హామీలు ఇలానే ఉంటాయని పలువురు చెబుతున్న పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -