Monday, April 29, 2024
- Advertisement -

టీడీపీ-బీజేపీ-జనసేన..ఇదే ఫైనల్

- Advertisement -

టీడీపీ – బీజేపీ – జనసేన మధ్య పొత్తు ఖరారుకాగా ఎట్టకేలకు సీట్ల పంపకాలు ఓ కొలిక్కివచ్చాయి. చంద్రబాబు నివాసంలో దాదాపు 8 గంటల పాటు మూడు పార్టీల నేతలు సమావేశం కాగా సీట్ల సంఖ్యపై ఫైనల్ నిర్ణయం తీసుకున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి 144, జేఎస్పీకి 21, బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి.

తొలుత ఫస్ట్ లిస్ట్‌లో జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు ఇవ్వగా ఇప్పుడు బీజేపీ ఒత్తిడితో 3 ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటును జనసేన వదులుకోవాల్సి వచ్చింది. ఇక ఇందుకోసం పవన్‌ని ఒప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.

6 ఎంపీ టిక్కెట్లు, 10 ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కించుకుని బీజేపీ అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లే దక్కించుకుంది. పోటీ చేసే సీట్ల సంఖ్య, స్థానాలు ఫైనల్ కావడంతో త్వరలోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -