సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు.
వైఎస్ఆర్ కుటుంబానికి వంగవీటి కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తమ్ముడు రాధా 2019లో చేసిన తప్పు వల్ల దూరం వచ్చిందని.. వంగవీటి కుటుంబానికి, వంగవీటి రంగా అభిమానులకు టీడీపీ ఎప్పటికీ బద్ద శత్రువే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంగవీటి రంగాను హత్య చేసిన పార్టీ టీడీపీ అని …ఆనాడు అధికారం అడ్డు పెట్టుకుని హత్య కేసును నీరు కార్చారని మండిపడ్డారు.రంగా అభిమానిని అని చెప్పుకునే పవన్.. టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలన్నారు. పవన్ ఉంది చంద్రబాబు మేలు కోసమేనని..కాపుల బాగుకోసం కాదని ఆరోపించారు. విజయవాడ ఈస్ట్ లో వైసీపీ గెలుపు కోసం పని చేస్తా అని తెలిపారు.