కెల్విన్ ఫోన్కాల్స్ డేటా ఆధారంగా హీరో నందు ను సిట్ అధికారులు ఈ రోజు విచారించారు. నందును కేవలం మూడు గంటల్లోనే విచారణను పూర్తి చేశారు. సిట్ అడిగిన పలు ప్రశ్నలకు నందు సమాధానం ఇచ్చారు. డ్రగ్స్ తో తనకు ఏలాంటి లింక్ లేదని తెలిపినట్లు తెలుస్తోంది. ప్రధానంగా నవదీప్, తరుణ్ పబ్ల విషయంలో నందును సిట్ బృందం అడిగినట్లు తెలుస్తోంది. అలానే ఈ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో గల సంబంధాల గురించి సిట్ ప్రశ్నించింది.
కెల్విన్ ఏవిధంగా పరిచయమయ్యాడు..? ఎక్కడ పరిచయమయ్యాడు.?..ఆయనతో ఉన్న సంబంధమేంటి? ఇలా నందుపై సిట్ ప్రశ్నల పరంపర కొనసాగించింది. మొత్తంగా మూడూ గంటల్లోనే నందు నుంచి అధికార్లు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. విచారణ కంప్లీట్ అయ్యాక మీడియాతో ఏం మాట్లాడకుండా వెళ్లిపోయాడు. సిట్ కార్యాలయం నుండి వెళ్తూ.. నందుతో పాటు ఆయన తండ్రి సిట్ కార్యాలయానికి వచ్చారు. నందు సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు అక్కడున్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు ఆలయం చుట్టూ ప్రదక్షణలు కూడా చేశాడు.
అయితే విచారణలో నందు పలు ప్రశ్నలు ఇలా సమాధం ఇచాడట, నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు, విచారణకు నన్ను ఎందుకు పిలిచారో అర్ధం కావడం లేదు, నవదీప్ పబ్ కి వెళ్లేవాడిని.. కానీ ఆ పబ్ లో డ్రగ్స్ సరఫారా అవుతున్నాయానే విషయం తనకు తెలియదని, నవదీప్ డ్రగ్స్ తీసుకునే విషయం తనకు తెలియదు అని, డ్రగ్స్ ముఠాకు సంబంధి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని, నా స్నేహితుల్లో కూడా ఎవరు డ్రగ్స్ తీసుకోరని నందు చెప్పినట్లు తెలుస్తోంది.
https://www.youtube.com/watch?v=ihdjpGhZnoM